భక్తుల రద్దీ తిరుమల తిరుపతి దేవస్థానంలో సాధారణంగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికీ మూడు గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 68,124 మంది భక్తులు దర్శించుకున్నారు.