telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సామాజిక

హెరిటేజ్ నెయ్యి తెచ్చిన తిప్పలు : .. టీటీడీ చైర్మన్ తులాభారం.. ఆ నెయ్యితోనే.. !

ttd chairmen balace with heritage ghee viral

ఒకపక్క బాబు పై ఆరోపణలు చేస్తూనే ఆయన సంస్థ హెరిటేజ్ ఉత్పత్తులను ప్రభుత్వం వాడేసుకుంటుంది.. తాజాగా, ఆ సంస్థకు చెందిన నెయ్యిని టీటీడీ చైర్మన్‌గా ఎన్నికైన వైసీపీ నేతల వైవీ సుబ్బారెడ్డి తులాభారంలో ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుబ్బారెడ్డి కాలినడకన తిరుమల చేరుకుని వేంకటేశుని దర్శించుకున్నారు. అనంతరం గరుడ ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తులాభారం ఫొటోను ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

శ్రీవారి సన్నిధిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డికి తులాభారం వేశారు. ఆ తులాభారం కోసం త్రాసులోని హెరిటేజ్ నెయ్యిని వాడారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసినవారు ఇప్పుడు అదే సంస్థ నెయ్యి వాడడం ఏమిటని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తుండగా, హెరిటేజ్ అనుసరిస్తున్న నాణ్యతా విధానాల వల్లే టీటీడీ ఇంకా దానిని వినియోగిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Related posts