telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబును విమర్శిస్తే సహించను.. మంత్రి తలసానికి వియ్యంకుడి హెచ్చరిక 

TTD chairman putta,talasani
ఏపీ సీఎం చంద్రబాబు పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యల పై తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఘాటుగా స్పందించారు. తనకు తలసాని వియ్యంకుడు అయినప్పటికీ.. చంద్రబాబుని విమర్శిస్తే ఊరుకోనని హెచ్చరించారు. కడప జిల్లా మైదుకూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ భిక్షతోనే ఈ స్థాయికి ఎదిగావు. దానిని మరిచిపోయి ఆయన్నే విమర్శించడం  తగదంటూ తలసానికి పుట్టా సూచించారు. 
ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ఈ స్థాయికి ఎదిగారంటే అది కేవలం చంద్రబాబు వల్లెనే అని పేర్కొన్నారు.  తలసాని తో పాటు మంత్రి యనమల, తాను ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబే కారణమని మరిచిపోవద్దని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడూ లేని విధంగా టీటీడీ చైర్మన్‌గా నన్ను నియమించారనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.   బీసీల్లోని వివిధ వర్గాలకు కూడా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించిన ఘనత చంద్రబాబుదేనని  కొనియాడారు.

Related posts