telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

టీటీడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

tirumala guest house

టీటీడీ పాలకమండలి బోర్డ్ సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల కొండపై తాగునీటి సరఫరా కోసం రూ. 10 కోట్లను కేటాయించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు.

ఇకపై డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బును జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ శాతం వడ్డీ వచ్చేలా బంగారాన్ని కూడా 5 ఏళ్లకు డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. స్వామివారికి ఇప్పటికీ పాత నోట్లు వస్తుండటంపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ నోట్లను మార్పిడి చేయడంపై ఆర్బీఐతో చర్చించాలని నిర్ణయించారు. అవసరమైతే పార్లమెంటులో ఎంపీల ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

Related posts