హుజూర్ నగర్ ఉపఎన్నిక విజయంతో సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మండిపడ్డారు. నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కండక్టర్ నీరజ మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిని విమర్శించారు.తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను కేసీఆర్ అలక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాటలతో ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. కేసీఆర్ కు కోర్టు శిక్ష వేయకపోయినప్పటికి, ప్రజలు వేస్తారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
డీజీపీ ఠాకూర్ కాన్వాయ్ లో రూ.35 కోట్లు.. సీఎం తరపున పంచటానికే .. : విజయసాయి