తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె టితో 17వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల బస్ డిపో ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు బైఠాయించి సోమవారం దీక్షకు దిగారు. వామపక్ష, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు దీక్షకు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ నాయకులను, వామపక్ష, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తోపులాటలో ఆర్టీసీ డ్రైవర్ వీఎస్ఎన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన అక్కకికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీఎస్ఎన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.