ఈ సంవత్సరం దసరా పండగ కోసం 4,933 తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్ఎం వరప్రసాద్ వెల్లడించారు.ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్ఎం తెలిపారు.
సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు బస్సులు నడుపుతున్నామన్నారు. 964 బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు, మిగితా వాటిని తెలంగాణలోని పలు ప్రాంతాలకు నడుపుతామని పేర్కొన్నారు.