ఆర్టీసీ ద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. డబుల్ డ్యూటీ చేసే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంస్థ యాజమాన్యం వేతనాలు పెంచింది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జోన్లలోని 13రీజియన్లలో పని చేస్తున్న సిబ్బందికి ఈ పెంపు వర్తిస్తుంది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులను జారీ చేశారు. గ్రేటర్లో ప్రస్తుతం రెగ్యులర్ డ్రైవర్లకు చెల్లిస్తున్న రూ.530ను రూ.600లకు, రెగ్యులర్ కండక్టర్లకు రూ.500 నుంచి రూ.550కు, కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.425 నుంచి రూ.500కు, కాంట్రాక్టు కండక్టర్లకు రూ.370 నుంచి రూ.400కు వేతనాలు పెరిగాయి.
ఇక హైదరాబాద్, కరీంనగర్ జోన్లలోని రీజియన్లలో పని చేస్తున్న రెగ్యులర్ డ్రైవర్లకు రూ.425 నుంచి రూ.500కు, రెగ్యులర్ కండక్టర్లకు రూ.375 నుంచి రూ.400కు, కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.340 నుంచి రూ.400కు, కాంట్రాక్టు కండక్టర్లకు రూ.300 నుంచి రూ.350కు డబుల్ డ్యూటీ చెల్లింపుల మొత్తాన్ని తెలంగాణ ఆర్టీసీ పెంచింది.