telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మేధావులు రాజకీయ నాయకులై పోతున్నారు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ చక్రపాణి

Ganta chakrapani

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేధావులు రాజకీయ నాయకులైపోతున్నారని, రాజకీయ నేతలు మేధావుల పాత్ర పోషించాల్సి వస్తోందని చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ ప్రభుత్వం మాది కాదనే ధోరణిలో మేధావి వర్గముందని స్పష్టం చేశారు. ఈ ఏడాది తర్వాత టీఎస్‌పీఎస్సీ నుంచి తప్పుకుంటానని తెలిపారు.

సంస్థలను నడిపే వ్యక్తులపై విమర్శలు సరికాదని ఆయన చెప్పారు. తాము ప్రజలపక్షం వైపే ఉన్నామని, ఎవరికి భయపడేది లేదని స్పష్టం చేశారు. మంగళవారం గ్రూప్-2 ఇంటర్వ్యూకు హాజరైన ఒక దివ్యాంగ అభ్యర్ధికి ఘంటా చక్రపాణి అనువాదకుడిని ఏర్పాటు చేశారు. అనువాదకుడు ఉంటే అభ్యర్ధి చెప్పే విషయం బోర్డు సభ్యులకు అర్థమవుతుందని ఆయన భావించారు.

Related posts