తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయి. ఈసెట్ కన్వీనర్ ఆచార్య లక్ష్మీనారాయణ ఓయూలో ఫలితాలు విడుదల చేశారు.
పీజీ ఈసెట్ తో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తారు. గత నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన పీజీ ఈసెట్ పరీక్షలకు 22,834 మంది హాజరయ్యారు. కాగా..హైదరాబాద్లో 17,864 మంది, వరంగల్లో 5, 323 మంది పరీక్ష రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.