telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణ కోర్టుల్లో లాక్ డౌన్ పొడిగింపు!

high court on new building in telangana

లాక్ డౌన్ లో నిబంధనలు సడలించిన తర్వాత తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల్లో లాక్ డౌన్ ను ఈనెల 28 వరకు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.అత్యవసర, తుది విచారణ కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ఆదేశించింది.

జిల్లా మేజిస్ట్రేట్, ట్రైబ్యునల్ కోర్టుల లాక్ డౌన్ ను ఈ నెల 14 వరకు హైకోర్టు పొడిగించింది. 15వ తేదీ నుంచి ఈ కోర్టులను తెరవాలని ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Related posts