టున్న పాలస్తీనా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్దరణ కోసం రూపొందించిన ప్రణాళికను వాషింగ్టన్లోని వైట్హౌస్లో ఆవిష్కరించారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ ప్రణాళికను విడుదల చేశారు. అయితే ఈ ప్రణాళికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పాలస్తీనా నాయకత్వం స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రణాళికను వ్యతిరేకించాలని పాలస్తీనా నాయకత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రణాళికకు సంబంధించి అమెరికా ఏకపక్షంగా చేసిన ప్రతిపాదనలను అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా వ్యతిరేకించారని పాలస్తీనా నేతలు చెబుతున్నారు. అమెరికా అనుసరిస్తున్న ఇజ్రాయిల్ అనుకూల వైఖరి కారణంగానే తాము ఈ ప్రణాళికను వ్యతిరేకిస్తున్నామని పాలస్తీనా ప్రధాని మహ్మద్ షతయ్యా మీడియాకు చెప్పారు. రెండు దేశాల పరిష్కారాన్ని అధికారికంగా గుర్తించేంత వరకూ అమెరికా నేతలతో ఎటువంటి చర్చలూ వుండబోవని షతయ్యా స్పష్టం చేశారు. 2017 నుండి కసరత్తు కొనసాగుతున్న ఈ శాంతి ప్రణాళిక వివరాలు ఇప్పటి వరకూ బహిర్గతం కాకపోవటం గమనార్హం.
త్రిష, నయనతారలను తల్లి పాత్రల కోసం ఎందుకు అడగరు… హీరోయిన్ ఫైర్ ?