ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా ఎఫ్ఆర్వోపై సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైఎస్ చైర్మన్ కృష్ణ తన అనుచరులతో అడ్డుకోవడమే కాకుండా అటవీ శాఖ అధికారులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన లో ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దాడిలో గాయపడ్డ మహిళా అధికారిణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోనేరు కృష్ణ మొదటగా నాపై దాడికి పాల్పడ్డారు. తర్వాత మరో 10మంది కోనేరు కృష్ణ అనుచరులు కర్రలతో నా తలపై కొట్టారు. ఆ క్షణంలో నేను బతుకుతానని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైఎస్ చైర్మన్ కృష్ణ తన అనుచరులతో అడ్డుకోవడమే కాకుండా అటవీ శాఖ అధికారులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. విధుల్లో ఉన్న అధికారుల పై చేయి చేసుకోవడం సబబుకాదని అన్నారు.