telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గ్రేటర్ ఎన్నికలు : మీడియా పైనే దాడి

గ్రేటర్‌ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రచారానికి వెళ్లిన నాయకులనే నిలదీస్తున్నారు భాగ్యనగర ప్రజలు. తాజాగా.. హయత్ నగర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సామ.తిర్మల్ రెడ్డి భూ కబ్జా చేశాడని నల్లగొండకు చెందిన ఓ కుటుంబం ఆందోళన దిగింది. ఆందోళనను చిత్రికరిస్తున్న ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ పై అనుచితంగా ప్రవర్తించారు తిర్మల్ రెడ్డి అనుచరులు. హయత్ నగర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సామ తిర్మల్ రెడ్డి భూ కబ్జా చేశాడని బాధితుల ఆందోళన చేస్తున్నారు. నల్లగొండకు చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. హయత్ నగర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి తన తమ్ముడు శ్రీధర్ రెడ్డితో కలిసి తన ప్లాట్ కబ్జా చేశాడని… మా ప్లాటు మాకు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.  చిన్న పిల్లలతో వచ్చి అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నిరసన చేశారు బాధితులు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతం అయింది బాధిత కుటుంబం. మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్లిన మాకు న్యాయం జగలేదని బాధిత కుటుంబం వాపోయింది.

Related posts