ఆంధ్రప్రదేశ్లోనూ తాము పోటీ చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బరిలోకి దిగనుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ తాను టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు.
డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరి కాయలు కొట్టి కొణిజేటి వార్తల్లోకి ఎక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోకాళ్లతో ఇంద్రకీలాద్రి కొండ ఎక్కారు. బెజవాడ అజిత్ సింగ్ నగర్కు చెందిన ఆదినారాయణ టీఆర్ఎస్ టికెట్పై పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతో పాటే తాను కేసీఆర్ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.