ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశానికి పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చించనున్నారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ లోక్సభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలు, విడుదల కావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాల అమలు పై పార్లమెంట్ లో వినిపించే దానిపై చర్చించనున్నారు.