telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

టీఆర్‌ఎస్ ..ఎన్నారై .. పార్టీ సభ్యత్వ నమోదు…

trs nri party members entry started

నేడు కేటీఆర్ పిలుపు మేరకు ప్రపంచంలోని 40 దేశాల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమయింది. టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల.. కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈసందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను స్థాపిస్తునందుకు ఎన్నారైలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 40 దేశాల్లోని ఎన్నారై శాఖలు తమ వంతు సహాయాన్ని అందించాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కోటి మందికి పైగా సభ్యత్వాలను నమోదు చేయాలని పిలుపునిచ్చారని.. ఆమేరకు ఎన్నారై శాఖలు తమ వంతు కార్యచరణ మొదలు పెట్టాయన్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై సలహాదారు, మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో వంద వరకు టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలను విస్తరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Related posts