టీఆర్ఎస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ పరిధిలోని చెంగిచర్లలో మంత్రి ఈ ఉదయం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. అభివృద్ధికి సహకరించే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలు వినూత్నంగా అభివృద్ధి సాధించాయన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి అన్ని వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. పని చేసేవారికే ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంఛార్జీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి