telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తమ్‌ పిచ్చి ప్రేలాపణలు చేయడం మానుకోవాలి: కర్నె ప్రభాకర్‌

karne prabhakar

హుజుర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పై శాసనమండలి విప్‌ కర్నె ప్రభాకర్‌ తీవ్ర విమర్శలు చేశారు.

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిచ్చి ప్రేలాపణలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఉత్తమ్‌ నైజం అని మండిపడ్డారు. ఉత్తమ్‌ హుజుర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే హుజుర్‌నగర్‌ ప్రజలకు లాభం.. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఉత్తమ్‌ కుటుంబానికి లాభం అని కర్నె వ్యాఖ్యానించారు.

Related posts