అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధిగా గెలుపొందినప్పటికీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దూరవిద్య ద్వారా తమ చదువును కొనసాగిస్తున్నారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ ఎల్ఎల్ఎం విద్యలో భాగంగా ఆయన మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. తాజాగా సోమవారం తోటి విద్యార్థులతో కలిసి ఆయన హన్మకొండకు వచ్చారు.
పట్టణంలో సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లాలో ఎల్ఎల్ఎమ్ పరీక్ష రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది రెండు సెమిస్టర్ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యానని తెలిపారు. పరీక్షలకు హాజరుకావడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందన్నారు.
అవన్నీ విజయసాయిరెడ్డి కోర్టులో చెప్పుకొంటాడు: దేవినేని ఉమ