telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వెంటనే విధుల్లో చేరి, చర్చలకు రావాలి: : ఎమ్మెల్యే శంకర్ నాయక్

shanker nayak mla

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని, వెంటనే విధుల్లో చేరి, చర్చలకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కోరారు. మహబూబాబాద్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు అవసరమైతే తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమని ఆయన అన్నారు.

గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కార్మికులు భేషజాలకు పోకుండా సమ్మెను విరమించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలనివిజ్ఞప్తి చేశారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం తనకుందని తెలిపారు.

Related posts