హైదరాబాద్ లో పాత్రికేయునిగా పనిచేస్తున్న మినాజ్ హుస్సెన్ పై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ టీఆర్ఎస్ నాయకుడు అతని కుమారులు విలేకరిపై దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రహ్మత్నగర్ కార్మికనగర్కు చెందిన మినాజ్ హుస్సెన్ ఓ ఛానెల్లో విలేకరిగా పనిచేస్తున్నాడు.
కొద్ది కాలంగా మినాజ్కు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బషీర్తో వైరం ఉంది. ఇది మనసులో పెట్టుకున్న బషీర్ సోమవారం మినాజ్కు ఫోన్ చేసి తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. మినాజ్ ఇంటికి రాగానే బషీర్ అతని కుమారులు సయ్యద్ సోహెల్, సయ్యద్ సల్మాన్, భావమరిది సయ్యద్ జాకీర్ మరికొంత మంది కలిసి కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మినాజ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.