telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ మద్దతు: కేటీఆర్

KTR Meets YS Jagan at Lotas pond
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ  అనంతరం బుధవారం  ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కూడ తమ పార్టీ ఎంపీ కవిత ప్రత్యేక హోదాపై ప్రస్తావించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ పలు పార్టీల అధినేతలతో ఇప్పటికే కలిశారని చెప్పారు. 
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే కేసీఆర్ త్వరలో  వైఎస్ జగన్‌ను నే ఏపీ రాష్ట్రంలో కలుస్తారని  కేటీఆర్ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పై వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ నిన్న ఫోన్ చేశారని తెలిపారు. జగన్ ఆహ్వానం మేరకు ఈ రోజు ఫ్రంట్ పై జగన్‌తో చర్చించామన్నారు.  భవిష్యత్తులో  ఏపీ రాష్ట్రానికి కూడ వైఎస్ జగన్‌తో  స్వయంగా కేసీఆర్ చర్చించనున్నారని ఆయన తెలిపారు.

Related posts