గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీ జెండానే ఎగురుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందా అని ప్రతిపక్షం ఎదురుచూస్తోందని విమర్శించారు. తెలంగాణలో పదహారుకు పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అన్నారు.
అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 33 జిల్లాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గంతంగా మాట్లాడుకోవాలే తప్ప, అందరిముందు మాట్లాడొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.
వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్