పొట్టకూటికోసం ఓ వ్యక్తిని నమ్మి దుబాయ్ వెళ్లిన యువతి అక్కడ యజమాని బాధలు భరించలేక అష్టకష్టాలు పడుతుంది. అక్కడ ఉన్న ఇంట్లో నరకయాతన పడుతుంది. అక్కడి బాధలు భరించలేక ఎలాగోలా ఓ సెల్ ఫోన్ సంపాదించి, తన కష్టాలను వీడియో తీసి బంధుమిత్రులకు పంపితే, అది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేరింది.
వెంటనే స్పందించే కేటీఆర్, దుబాయ్ లోని భారత రాయబారి నవదీప్ సూరిని ట్యాగ్ చేస్తూ విషయాన్ని తెలిపారు. ఉపాధి కోసం వెళ్లిన తాను, ఒక ఇంట్లో పనికి కుదిరి, ఆ ఇంటి యాజమాని కుటుంబం కారణంగా ఇక్కట్లు పడుతున్నానని ఆ యువతి వివరించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ యువతి కష్టాలను దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం దృష్టికి తెచ్చారు. బాధిత మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన భారత రాయబారి ఆమె ఆచూకీ కోసం చర్యలు చేపడతామంటూ ట్విట్టర్ లో సమాధానమిచ్చారు.