telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కవిత ఓటమికి కారణాలు వివరించిన కేటీఆర్‌

KTR Counter pawan comments

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నుంచి ఎంపీగా ఓటమిపాలైన తన సోదరి కవిత గురించి ప్రస్తావించారు. కవిత ఓటమికి రైతులు కారణం కాదని స్పష్టం చేశారు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదని, రాజకీయ కార్యకర్తలేనని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి 93 మంది నామినేషన్లు వేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కావడం వల్లే కవిత ఓడిపోయారని అన్నారు. ఒక్క ఓటమితో కుంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించిందని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక సరిగా లేదన్న వాదనతో ఏకీభవించనని చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 11 లోక్ సభ స్థానాలు గెలుచుకున్నామని, ఈసారి మాత్రం 6 శాతం ఓట్లు పెరిగినా తమకు తొమ్మిది సీట్లే వచ్చాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్‌ బ్రేకర్‌లాంటివన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ మంచి సీట్లను గెలుచుకుందిన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం బీజేపీ గెలుస్తుందని ఊహించలేదన్నారు.

Related posts