ఢిల్లీ మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో మనోళ్లు ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి మాత్రమే లాభం. తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి మాత్రమే లాభమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రూ.80వేల కోట్ల రాష్ట్ర నిధులు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు ఇవ్వమంటే బీజేపీ ఇవ్వలేదన్నారు. కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యరతి వినోద్ కుమార్ను గెలిపిస్తే రాబోయే రెండేళ్లలో కరీంనగర్కు రైలు వస్తుందన్నారు. తెలంగాణకు రూ.25వేలు కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మోదీ నిధులు ఇవ్వలేదన్నారు. .ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న రాష్ర్టాలకే మోదీ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదు: సీపీఐ నేత చాడ