telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వీలైనంత త్వరగా భవన నిర్మాణాలు పూర్తి చేయాలి: కేటీఆర్

ktr trs president

జిల్లా కార్యాలయాల భవన నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి కావాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించారు.నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రులు, జిల్లా చైర్‌పర్సన్లకు అప్పగించారు. తొమ్మిది జిల్లాల్లో మంత్రులు, మిగతా జిల్లాల్లో జడ్పీ చైర్ పర్సన్లు ఈ నెల 24న . కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ మేరకు కేటీఆర్ నేడు ఫోన్ ద్వారా ఆయా నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎవరి జిల్లాకు వారు వెళ్లి స్వయంగా పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలంతా హాజరు కావాలని కోరారు. పార్టీ అధినేత కేసీఆర్ కార్యాలయ భవనాల నమూనాలను ఖరారు చేస్తారని తెలిపారు.

Related posts