నిజామాబాద్ జిల్లా నవీపేట ఎంపీపీ ఎన్నిక అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అధికార పార్టీ వశమైంది. మండల పరిషత్ అధ్యక్ష పదవిని తెరాస అభ్యర్థి సంగెం శ్రీనివాస్ కైవసం చేసుకున్నారు. తెరాస ఎంపీపీ అభ్యర్థిని భాజపా మద్దతుదారుడైన ఎంపీటీసీ రాజేశ్వర్ ప్రతిపాదించగా తెరాస అభ్యర్థి కృష్ణమోహన్ బలపర్చారు. తెరాసకు చెందిన ఏడుగురు, భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీటీసీ అభ్యర్థులు శ్రీనివాస్కు మద్దతు తెలపడంతో ఆయన ఎంపీపీగా గెలుపొందారు.
ఉపాధ్యక్ష పదవిని కోస్లి ఎంపీటీసీ సభ్యుడు(భాజపా)హరీష్ దక్కించుకున్నారు. తెరాస, భాజపా సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు చెందిన ఐదుగురు సభ్యులు, భాజపాకు ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు తెలుపుతారని తొలుత ప్రచారం జరిగినా చివరి క్షణాన తెరాసకు మద్దతిచ్చారు. దీంతో తెరాస అభ్యర్థి విజయం లాంఛనమైంది.
పథకాలు మా విజయానికి కీలకం: చంద్రబాబు