మహబూబ్నగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జితేందర్రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లాలో మంత్రులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. మంత్రుల ఓటమికి జితేందర్రెడ్డి కారణమన్న ఉద్దేశంతో లోక్సభ ఎన్నికల్లో ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
ఈ క్రమంలో జితేందర్రెడ్డి పార్టీ మారుతారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ సమయంలోనే డీకే అరుణ బీజేపీలో చేరడం, ఆమెకు మహబూబ్నగర్ టికెట్ ప్రకటించారు. అయితే బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపి రాజకీయ భవిష్యత్పై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 29న మహబూబ్నగర్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ సమక్షంలో జితేందర్రెడ్డి బీజేపీ కండువా వేసుకుంటారని తెలుస్తోంది.