telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సీఏం చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు!

Chandrababu comments Jagan cases
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డేటా చోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య రగిలిపోతుంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై  హైదరాబాద్ లో కేసు నమోదయింది. 
ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసుల సోదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రవాదులతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన వ్యాఖ్యలతో చంద్రబాబు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా   వ్యవహరించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Related posts