కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్రెడ్డి పై తెలంగాణ మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైందని, పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని విమర్శించారు.
జెన్కో సీఎండీ ప్రభాకర్రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డి జెన్కో సీఎండీ ప్రభాకర్రావులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభాకర్రావు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభాకర్రావు అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో జెన్కో సీఎండీ ఆరునెలల్లోనే విద్యుత్ కొరత తీర్చారని ఆయన అన్నారు.