తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గానూ టీఆర్ఎస్ 15 స్థానాలు దక్కించుకుంటుందని తేలింది. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన నేషనల్ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇక టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీ ఓ సీటును దక్కించుకుంటుందనీ, కాంగ్రస్ పార్టీకి మరోస్థానం దక్కుతుందని అంచనా వేసింది. ఇటీవల డీకే అరుణ సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరినప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో గెలిచే అవకాశం లేదని చెప్పింది.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 44.62 శాతం ఓట్లు దక్కే అవకాశముందని సర్వేలో తేలింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 30.1 శాతం, బీజేపీ 13.79 శాతం, మజ్లిస్ 4.70 శాతం, సీపీఎం 0.72 శాతం, సీపీఐ 0.63 శాతం, జనసేన 0.40 శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది. ఇతరులు మరో 5 శాతం ఓట్లను దక్కించుకుంటారని వెల్లడించింది.
సెక్రటేరియట్కు మరో 70 ఏళ్ల పాటు ఢోకా లేదు: వీహెచ్