telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీ..ఇద్దరు మృతి

Accident

ఒడిశాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారందరిని పోలీసులు భద్రక్‌ ఆస్పత్రికి తరలించారు.

టూరిస్టులంతా ఉత్తరప్రదేశ్‌ నుంచి పూరీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది యాత్రికులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts