telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ ఆయన నటించిన సినిమాలనే చూడరు : త్రివిక్రమ్

Trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం “అల వైకుంఠ‌పుర‌ములో”. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతుంది. రూ.200 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అటు ఓవర్సీస్‌లోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. త్రివిక్రమ్‌ను చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసించారు. ఎన్టీయార్, రామ్‌చరణ్ వంటి హీరోలు అభినందనలతో ముంచెత్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ సినిమాపై ఎలా స్పందించారు ? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ `పవన్ ఇంకా సినిమా చూడలేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన తను నటించిన సినిమాలనే పెద్దగా చూడరు. `అత్తారింటికి దారేది` సినిమా చూడమని బతిమాలితే వంద రోజుల తర్వాత చూశారు. ఈ సినిమాను నెల రోజుల లోపే చూస్తారని నేను ఆశిస్తున్నాణు అని చెప్పారు.

Related posts