telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి జంటగా సిద్ధార్థ్, త్రిష

Trisha-and-siddharth

13 ఏళ్ళ క్రితం సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన చిత్రం “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”. ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథా చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా మారింది ఈ చిత్రం. ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష తమ నటనతో చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ మళ్లీ ఇంతకాలానికి కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. క్రితం ఏడాది హిందీలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న “అంధాదున్” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఒక ప్రధానమైన పాత్ర కోసం సిద్ధార్థ్ ను ఎంపిక చేసుకోగా, మరో ప్రధానమైన పాత్రకి గాను త్రిషను సంప్రదించారనీ, ఈ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రను త్రిష చేయనుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఇప్పటికే సిద్ధార్థ్ చెప్పడం విశేషం.

Related posts