telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ట్రిపుల్ తలాక్ బిల్లు .. ఆమోదం.. ఇక రాజ్యసభకు..

E B C Bill Passes Lok Sabha

లోక్ సభ లో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం లభించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 303 మంది సభ్యులు, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు ఓటు వేశారు. గత నెలలోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినా విపక్షాల వ్యతిరేకతతో చర్చ జరగలేదు. ఈ క్రమంలో లోక్ సభలో ఈరోజు ఉదయం ఈ బిల్లుపై చర్చ మొదలైంది. దీనిపై పూర్తి స్థాయి చర్చ జరిగిన అనంతరం, ఆమోదం పొందేందుకు ఓటింగ్ నిర్వహించారు.

లోక్ సభలో ఆమోదం పొందడంతో, ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం పంపనున్నారు. ఓటింగ్ సందర్భంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్, జేడీయూలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ బిల్లులో మార్పులు చేయాలని సూచించాయి.

Related posts