జల్లికట్టుకు తమిళనాడు పెట్టింది పేరు. గతంలో దీనిపై అనేక విమర్శలు వచ్చినా, ఇంకా ఆ ఆటను సాంప్రదాయంగా భావించిన తమిళ యువత కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఈ పోటీలో పెద్ద ఎత్తున యువత పాల్లొన్నారు. కోడెలను లొంగదీసుకుని ప్రయత్నంలో దాదాపు 40 మంది గాయపడ్డారు. 740 ఎద్దుల్ని లొంగదీసుకునేందుకు.. 1700 మంది పోటాపోటీగా రంగంలోకి దిగారు. దాదాపు 40 వేల మంది జల్లికట్టు తిలగించేందుకు తరలివచ్చారు.
పోటీలో 13కిపైగా ఎద్దుల్ని లొంగదీసుకున్న కార్తీక్ అనే యువకుడు కార్ గెలుచుకున్నాడు. ఈ పోటీలు ప్రారంభించడానికి ముందు పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించారు.