telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సులో పొగలు

travels bus

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయపడ్డారు. నగరం నుంచి బయలుదేరిన బస్సు మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లకు చేరుకున్న కాసేపటికే బస్సులో పొగలు వ్యాపించాయి. బస్సులో కమ్ముకున్న పొగను చూసిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు.

వెంటనే డ్రైవర్‌ బస్సును ఆపగానే అందరూ కిందికి దిగారు. బస్సు లగేజీలో రెండు ద్విచక్ర వాహనాలు ఉండడం వల్లే పొగలు వ్యాపించినట్టు గుర్తించి నిలిపివేశారు. అయితే, ఆ తర్వాత మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు మూడు గంటలపాటు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

Related posts