రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం “దర్బార్”. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నయనతార, నివేదా థామస్, దలీప్ తాహిల్, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి “దర్భార్”: చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ముంబైలో చిత్రీకరణను జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రజనీకాంత్ జీవా అనే ట్రాన్స్జెండర్తో నటిస్తున్నారు. జీవా ఇది వరకు విజయ్ సేతుపతి చిత్రం “ధర్మదొరై”లో ఓ కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు “దర్బార్”లో రజనీకాంత్తో నటిస్తున్నారు. ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంతోశ్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సెట్లో ఆడవారితో బాలకృష్ణ తీరు ఇదే… బాలకృష్ణ అభిమానికి “నో” చెప్పిన పాకీజా