ఎన్టీపీసీ కరెంటుపై ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు రాసిన వార్తల పై తెలంగాణ ట్రాన్స్కో, జోన్కో సీఎండీ ప్రభాకర్రావు తీవ్రం గా ఖండించారు. రామగుండం రెండోదశకు ప్రభుత్వం మోకాలడ్డుతోందంటూ తలాతోకా లేని వార్తలు రాసిందని మండిపడ్డారు. నాణ్యమైన విద్యుత్ అన్ని వర్గాలకు సరఫరా చేస్తుంటే ఓర్వలేక తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ విద్యుత్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. దేశం మొత్తం మనరాష్ట్రం వైపు చూసేలా విద్యుత్ వ్యవస్థను తయారు చేశారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలకు అందరూ అభినందనలు చెబుతుంటే ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తను రాసిందన్నారు. పూర్తి అవాస్తమైన కట్టుకథలతో వార్తను ప్రచురించిందని పేర్కొన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారు: యనమల