పవర్గ్రిడ్ లో ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబందించిన దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 15న powergridindia.com వెబ్సైట్లో ప్రారంభం కానుంది. ఇట్టి దరఖాస్తు 2020 ఫిబ్రవరి 15 తేదీన ముగియనుంది. ఈ పోస్టులను గేట్ 2020 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఈ పోస్టులకు సంబందించిన ఖాళీల వివరాలను డీటెయిల్ట్ నోటిఫికేషన్లో వెల్లడించనుంది పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2020 జనవరి 10న పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల కానుంది.
నోటిఫికేషన్ వివరాలు:
పోస్టులు- ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 15
విద్యార్హత- బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సు చేయాలి. గేట్ 2020 స్కోర్ ఉండాలి.
వయస్సు- 28 ఏళ్ల లోపు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500.
ఆరోపణలు చేసే వారు ఆధారాలతో మాట్లాడాలి: కోడెల