telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పవర్‌గ్రిడ్ లో … ఎగ్జిక్యూటీవ్ ట్రైనీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

trainee jobs in power grid of india

పవర్‌గ్రిడ్ లో ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబందించిన దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 15న powergridindia.com వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది. ఇట్టి దరఖాస్తు 2020 ఫిబ్రవరి 15 తేదీన ముగియనుంది. ఈ పోస్టులను గేట్ 2020 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఈ పోస్టులకు సంబందించిన ఖాళీల వివరాలను డీటెయిల్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2020 జనవరి 10న పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల కానుంది.

నోటిఫికేషన్ వివరాలు:

పోస్టులు- ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 15

విద్యార్హత- బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సు చేయాలి. గేట్ 2020 స్కోర్ ఉండాలి.

వయస్సు- 28 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500.

Related posts