telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

సత్యాగ్రహ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు .. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

train fire station

ఢిల్లీ నుంచి రక్సోల్ వెళుతున్న సత్యాగ్రహ్ ఎక్స్‌ప్రెస్‌ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.షాజహాన్‌పూర్ నుంచి సీతాపూర్ వైపు వస్తుండగా రైలును మొహాలీ వద్ద ఆపివేసి మంటలను అదుపుచేశారు. రైలు చక్రాల వద్ద మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా రైలును 50 నిముషాల పాటు నిలిపివేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ట్రైన్ మొహాలీ స్టేషన్ దాటుతుండగా ఎస్-2 కోచ్ వద్ద నిప్పంటుకుంది.

దీనిని ప్రయాణికులు గమనించి అధికారులకు తెలియజేశారు. దీంతో ట్రైన్‌ను నిలిపివేసి, మంటలను అదుపుచేశారు. ఈ సమయంలో అటువైపుగా వచ్చే రైళ్ల రాకపోకలను నియంత్రించారు. కాగా ఈ ప్రమాదం బ్రేక్ టూల్ జామ్ అయినందున సంభవించిందని బావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Related posts