telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

రాజ్‌భవన్‌ పరిసరాల్లో ఆంక్షలు

Republic Day Celebrations Hyderabad
హైదరాబాద్ రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లో శనివారం పోలీసులు ఆంక్షలు విధించారు. గణతంత్ర్య దినోత్సవాన్ని  పురస్కరించుకుని గవర్నర్‌ తన అధికార నివాసంలో విందు ఇవ్వనున్న  నేపథ్యంలో రాజ్‌భవన్‌ రోడ్ లో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ పేర్కొన్నారు. గులాబీ రంగు పాస్‌లతో వచ్చే ఆహుతులు రాజ్‌భవన్‌ గేట్‌–1 ద్వారా లోపలకు ప్రవేశించాలి. దర్బార్‌ హాలు ఎదురుగా వాహనాలు ఆపాలి. వీటిని అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ దగ్గర పార్క్‌ చేసుకోవాలి. 
ఆకుపచ్చ రంగు పాస్‌లకు గేట్‌–2 కేటాయించారు. ఇవి కూడా దర్బార్‌ హాల్‌ దగ్గర ఆహుతులను దింపి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ దగ్గర పార్క్‌ చేసుకోవాలి. తెల్లరంగు పాస్‌లకు గేట్‌–3 కేటాయించారు. వీరికి దిల్‌కుష్‌ గెస్ట్‌ హౌస్‌లో పార్కింగ్‌ కేటాయించారు. మిగిలిన వారంతా తమ వాహనాలను ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లో పార్క్‌ చేసుకోవాలి. డ్యూటీ వెహికిల్స్‌కు చిల్లా వద్ద పార్కింగ్‌ చేయాలని సూచించారు.

Related posts