హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌవాన్ రాజ్భవన్లో శనివారం ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా రాజ్భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ తెలిపారు. ప్రమాణస్వీకారం 10.30 గంటలకు ఉన్నందున ఉదయం 9.30 నుంచి 11.30 వరకూ రాజ్భవన్ పరిసరాల్లో ఆంక్షలు ఉంటాయి.
మోనప్ప ఐలాండ్ నుంచి వీవీ స్టాచ్యూ జంక్షన్ వరకూ, పంజాగుట్ట నుంచి రాజ్భవన్ క్వార్టర్స్ వరకూ సాధారణ ట్రాఫిక్ను అనుమతించరు.చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి చాలా మంది ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా ఈ రూట్లో వెళ్లే వాహనాలను మరో రూట్లోకి మళ్లించి, రాజ్భవన్ రూట్, పంజాగుట్ట, రాజ్భవన్ క్వార్టర్స్ రోడ్డును నిర్ణీత సమయానికి మూసివేస్తామన్నారు.
జగన్ అందుకే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ బుద్ధా