ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు సందర్భంగా ఆ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు. అబిడ్స్, గన్ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్ఫౌండ్రి నుంచి చాపేల్ రోడ్డులో అనుమతిస్తారు.
బషీర్బాగ్ జంక్షన్ నుంచి జీపీఓకు వచ్చే వాహనాలను బషీర్బాగ్ జంక్షన్ నుంచి హైదర్గూడ, కింగ్కోఠి మీదుగా మళ్లిస్తారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్నగర్ జంక్షన్ వైపుకు మళ్లిస్తారు. కింగ్ కోఠి నుంచి బషీర్ బాగ్కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్ వద్ద కింగ్కోఠి క్రాస్ రోడ్డు మీదుగా తాజ్మహల్ హోటల్ వైపు మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్నగర్ రోడ్డులో పంపిస్తారు.a