telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: శ్రీధర్ బాబు

sridar babu mla

హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. సోమవారం పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సారి బడ్జెట్‌లో రైతులు, సామాన్య మధ్య తరిగతి ప్రజల ప్రస్తావనే లేదన్నారు.

టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల విధానం ఒక్కటేనని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీతో తమకు నిధులు అవసరం లేదని, తామే స్వంతంగా పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే అవకాశాలున్నాయని అన్నారు.

Related posts