telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలి: ఉత్తమ్

uttam congress mp

నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ సూచించారు. సామాన్యులకు అవసరమైన ఒక్క పని జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వచ్చాక ఉస్మానియా హాస్పిటల్ నిర్లక్షానికి గురైందని దుయ్యబట్టారు. . ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరడం కేసీఆర్ అసమర్థతేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.ఉస్మానియా బిల్డింగ్ బేసిక్ స్ట్రక్చర్ బాగానే ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ఇదే కాంప్లెక్స్‌లో ఆరేకరాల ఖాళీ స్థలం ఉందని, ఆ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. సచివాలయాన్ని కడుతున్నారని… కానీ హాస్పిటల్ కట్టే సోయి ప్రభుత్వానికి లేదని ఉత్తమ్ దుయ్యబట్టారు.

Related posts