telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ

లోయలో పడ్డ.. టూరిస్టు బస్సు.. 36మంది..

over speed costs 4 students

ఇటీవల బస్సులు లోయలో పడుతున్న ప్రమాదాలు చాలానే జరుగుతున్నాయి. దీనికి కారణం వయసైపోయిన బస్సులా లేక ఆయా సంస్థల నిర్లక్ష్యమా.. అనేది అందరికి తెలిసిందే. కానీ చివరికి బాధితుడు మాత్రం సామాన్యుడు. మరో టూరిస్టు బస్సు ఒకటి అదుపుతప్పి లోయలోకి దూసుకువెళ్లిన ఘటనలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. కర్నూల్‌ జిల్లా శ్రీశైలం సమీపంలోని చిన్నారుట్ల వద్ద ఘాట్‌ రోడ్డుపై ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

మహారాష్ట్రకు చెందిన 36 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి ఘాట్‌ రోడ్డు రక్షణ గోడను ధ్వంసం చేసుకుంటూ లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బ్రేకులు పనిచేయక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్‌ తెలిపాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను విచారణ చేస్తున్నారు.

Related posts