telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్షర క్రమంలో ముందుండే అమరావతి.. పర్యాటకంలోనూ ముందుండాలి

అక్షర క్రమంలో ముందుండే అమరావతి.. పర్యాటకంలోనూ ముందుండాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని భవానీ ద్వీపాన్ని అందమైన బృందావనంగా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చాలా దేశాల్లో ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమేనని అన్నారు. సముద్రం, నదులు, అడవులు వంటి పర్యాటక వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు.

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ‘అతిథి దేవోభవ’ పేరుతో ఏపీలో పర్యాటకాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విజయవాడ వచ్చే పర్యాటకులంతా భవానీ ద్వీపాన్ని సందర్శించేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం చేయిస్తామని అన్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పెంచుతామని స్పష్టం చేశారు.

Related posts